జిల్లాలో ఉన్న కార్యాలయాల్లో వినతులు స్వీకరణ

PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. మీ కోసం వెబ్సైట్ లోనూ అర్జీలు నమోదు చేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఉన్న అన్ని కార్యాలయాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరుగుతుందన్నారు.