LLB, పీజీ పరీక్షలు.. 107 మంది గైర్హాజరు
NZB: టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎల్ఎల్బీ 5వ, పీజీ మొదటి, IMBA 7వ సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం 8 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 1,933 మంది విద్యార్థులకు 1,825 మంది హాజరు కాగా, 107 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.