సివిల్స్ విజేతకు ఘన సన్మానం

సివిల్స్ విజేతకు ఘన సన్మానం

VSP: గాజువాక నియోజకవర్గంలోని 87వ వార్డు కణితి కాలనీకి చెందిన గుమ్మాల రాజబాబు కుమార్తె శ్వేత సివిల్స్ పరీక్షల్లో 573వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆమెను శనివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మహేష్‌తో పాటు మధు, ఆర్‌వీ సుధాకర్, ఆర్‌వీ శ్రీనివాసులు, గోవింద్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.