'నవంబర్ 13 లోపు పది పరీక్షా ఫీజు చెల్లించాలి'
NRML: నవంబర్ 13లోపు పదో తరగతి ఫీజు చెల్లించాలని డీఈవో భోజన్న శనివారం తెలిపారు. మార్చి 2026లో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఈనెల 30 నుంచి నవంబర్ 13 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. నవంబర్ 29 వరకు రూ. 50, డిసెంబర్ 11 వరకు రూ. 200, డిసెంబర్ 29 వరకు రూ. 500 అపరాధ రుసుముతో చెల్లించవచ్చని వారు సూచించారు.