చౌడేశ్వరి ఆలయానికి విరాళం అందజేత

చౌడేశ్వరి ఆలయానికి విరాళం అందజేత

NDL: శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధికి నెల్లూరు వాసి హరి ప్రసాద్ కుటుంబం రూ.50,116 విరాళం అందజేశారు. ఈవో శ్రీనివాసరెడ్డి, ఆలయ ఛైర్మన్లు పీవీ కుమార్ రెడ్డి, పీవీ నాగార్జున రెడ్డి నగదు స్వీకరించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. విరాళంపై ఆలయ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. అభివృద్ధి పనులకు నిధులు వినియోగిస్తామన్నారు.