బస్సులో పొగలు.. తప్పిన ప్రమాదం
KRNL: గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. అయిజ నుంచి సుమారు 90 మంది ప్రయాణికులతో కర్నూలు వెళ్తున్న బస్సులో నుంచి పొగలు వచ్చాయి. మద్దూరు స్టేజీ వద్ద వెనకాల టైర్లోని బేరింగ్ నుంచి పొగలు వస్తున్నట్లు అద్దంలో డ్రైవర్ గమనించినట్లు చెప్పాడు. దీంతో డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను సురక్షితంగా రక్షించాడు.