ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడోద్దు: సీపీ
HYDలో కల్తీకి పాల్పడేవారిపై సీపీ వీసీ సజ్జనర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం సమాజంపై దాడి వంటిదేనని ఆయన పేర్కొన్నారు. ఇవాళ బషీర్బాగ్లో 'హెచ్-ఫాస్ట్' ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో వ్యాపార ప్రతినిధుల సమక్షంలో సీపీ మాట్లాడారు. నెల రోజుల్లోనే 92 కేసులు, 62 టన్నుల కల్తీ ఆహారాన్ని సీజ్ చేశామని, 98 మందిని అరెస్ట్ చేశామన్నారు.