వైరల్ వీడియో: 'పెట్టుబడులు అవసరం లేదు'
వికారాబాద్లో రూ. 2000 కోట్ల విలువైన పెట్టుబడులు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వికారాబాద్ కడ్లాపూర్, రాపోల్ గ్రామాల్లో ప్రభుత్వం 1200 ఎకరాల వ్యవసాయ భూముల భూసేకరణకు సిద్ధమైంది. దీనికి వ్యతిరేకంగా కడ్లాపూర్ యువకులు ఓ వీడియోను చిత్రికరించారు. 'మాకు పెట్టుబడులు అవసరం లేదు, కనీస సదుపాయాలు కల్పించండి' అంటూ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.