మంత్రిని కలిసిన జేఏసీ నాయకులు

మంత్రిని కలిసిన జేఏసీ నాయకులు

KNR: హుజూరాబాద్ డంప్ యార్డ్ సమస్యపై జేఏసీ నాయకులు, మున్సిపల్ పాలకవర్గం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. వెస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ వల్ల ఈ ప్రాంతం కాలుష్యానికి గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డంప్ యార్డును తరలించాలని కోరగా, విషయం తన దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు.