నిత్య ఉచిత అల్పాహార సేవ ప్రారంభం!

నిత్య ఉచిత అల్పాహార సేవ ప్రారంభం!

RR: గచ్చిబౌలి గోపనపల్లిలోని రంగనాథ స్వామి ఆలయం పక్కన గల ఇస్కాన్ దేవాలయంలో నిత్య ఉచిత బ్రేక్ ఫాస్ట్ సేవను మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రారంభించారు. ప్రతిరోజూ ఉదయం 09:00 నుంచి 10:30 గంటల వరకు భక్తులకు, పేదలకు, స్థానికులకు ఈ పోషకాహార అల్పాహారం అందించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే ధ్యేయంగా ఇస్కాన్ ట్రస్టు ఈ కార్యక్రమం చేపట్టారు.