ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
కృష్ణా: గుడివాడ ఎస్సీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో సీఐ శ్రీనివాస్ విద్యార్థినులకు నిన్న ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. విద్యార్థులు అపరిచిత వ్యక్తులతో మాట్లాడకూడదని, హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు తల్లిదండ్రులతో మాత్రమే వెళ్లాలన్నారు.ఇన్స్టాగ్రామ్,ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దన్నారు.