మధ్యప్రదేశ్, హర్యానా పరిశీలకులుగా తెలుగు నేతలు

మధ్యప్రదేశ్, హర్యానా పరిశీలకులుగా తెలుగు నేతలు

మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో జిల్లా అధ్యక్షుల ఎంపీక ప్రక్రియను కాంగ్రెస్ పకడ్బందీగా నిర్వహిస్తోంది. వీరి ఎంపిక కోసం 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు నేతలను AICC పరిశీలకులుగా నియమించింది. AP నుంచి సీనియర్ నేతలైన గిడుగు రుద్రరాజు, సిరవెళ్ల ప్రసాద్, TG నుంచి సంపత్ కుమార్‌ను MP పరిశీలకులుగా, అలాగే TGకి చెందిన వంశీ చంద్ రెడ్డి హర్యానా పరిశీలకుడిగా నియమితులయ్యారు.