గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
PLD: రాజాపేట ఏపీ గురుకుల పాఠశాలలో (బాలురు) 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రకటన విడుదలైంది. 5వ తరగతిలోని 80 సీట్లతో పాటు 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 24న జరగనుంది. ఎంపికైన వారికి వసతి, ఉచితంగా అందిస్తారు.