స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో ఎస్పీ సమీక్ష

అనంతపురం: సైబర్ నేరాలు, రోడ్డు సేఫ్టీ, డ్రగ్స్ అనర్థాలు & క్రైం అగనెస్ట్ ఉమెన్ తదితర నేరాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు భాగస్వామ్యులు కావాలని ఎన్జీవోల ప్రతినిధులకు జిల్లా ఎస్పీ జగదీష్ పిలుపునిచ్చారు. స్వచ్ఛంధ సేవా సంస్థల ప్రతినిధులతో అనంతపురం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ సమావేశం నిర్వహించారు. సమిష్టిగా కృషి చేసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.