విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం వివరాలు

కోనసీమలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శనివారం వివిధ సేవల ద్వారా రూ.1,78,126 ఆదాయం లభించిందని ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 211 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 7 మంది దంపతులు శ్రీ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారన్నారు. అలాగే, 1900 మంది అన్న ప్రసాదం స్వీకరించారని వివరించారు.