హరీష్రావువి అన్ని తప్పుడు ఆరోపణలే: మంత్రి
HYD: హరీష్రావు కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ కేవలం వడ్డీలకే సరిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం కేవలం 9రోజుల్లోనే రూ.9వేల కోట్లు రైతు భరోసా కింద జమ చేసి రికార్డు సృష్టించిందని స్పష్టం చేశారు.