కొండమల్లేపల్లిలో నగదు చోరీ.. దొంగ అరెస్ట్
NLG: కొండమల్లేపల్లి వాసవి బజార్లో తాళం వేసిన నాగరాజు ఇంట్లో రూ.67,000 నగదు దొంగిలించిన నిందితుడు బాబాను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.50,000 స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కేసును ఛేదించిన సీఐ నవీన్ కుమార్, ఎస్సై రమేష్లను డీఎస్పీ అభినందించారు.