64 లక్షల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
అన్నమయ్య: పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ఆదివారం తన కార్యాలయంలో రూ. 64,11,890 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను బాధితులకు అందజేశారు. కష్టాల్లో ఉన్న నియోజకవర్గ ప్రజలను ఆదుకోవడమే లక్ష్యమని, ప్రజల ఆరోగ్య సమస్యలు, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిధులు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.