ఈ నెల 4న ప్రారంభంకానున్న ముసలమ్మ జాతర
MHBD: కొత్తగూడ మండలంలోని గుంజేడు అడవుల్లో శ్రీ గుంజేడు ముసలమ్మ తల్లి జాతర ఈ నెల 4 నుంచి వైభవంగా ప్రారంభం కానుంది. పచ్చని అడవుల మధ్య వెలసిన ఈ వనదేవత ఆలయం గిరిజన సంస్కృతికి నిలువెత్తు చిహ్నం. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.