గుంటూరు జీజీహెచ్లో అరుదైన ట్యూమర్ శస్త్రచికిత్స

GNTR: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ సర్జరీ విభాగంలో గురువారం అరుదైన డెస్మాయిడ్ ట్యూమర్కు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. రూ.6 లక్షల ఖర్చు అయ్యే ఆపరేషన్ను ఎన్టీఆర్ వైద్యసేవలో ఉచితంగా నిర్వహించారు. ప్రతి 10 లక్షల మందిలో 2, 4 మందికే వచ్చే ఈ ట్యూమర్ను డా. కిరణ్ కుమార్ బృందం సఫలంగా తొలగించిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ తెలిపారు.