ప్రొద్దుటూరు ఇస్కాన్ను సందర్శించిన MLA

KDP: ప్రొద్దుటూరులోని ఇస్కాన్ టెంపుల్ను శుక్రవారం మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా శనివారం జరగనున్న కృష్ణాష్టమి వేడుకలను గురించి ఆలయ ప్రతినిధులు ఆయనకు వివరించారు. ఆలయానికి సంబంధించి కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కృష్ణాష్టమి వేడుకలకు హాజరు కావాలని నిర్వహకులు ఆయనను కోరారు.