ఘనంగా ఆదిశంకరుడి జయంతి వేడుకలు
VSP: హిందూ ధర్మ రక్షణ కోసం భారతదేశంలో నాలుగు దిక్కులలో నాలుగు మాఠాలను స్థాపించిన జగత్గురు ఆదిశంకరాచార్యుడి జయంతిని జిల్లాలోని శ్రీ కాంచి కామకోటి శంకర మఠంలో ఘనంగా నిర్వహించారు. ప్రపంచానికి అద్వైత( జీవాత్మ, పరమాత్మ ఒక్కటే) అనే సిద్దాంతాన్ని పరిచయం చేసినట్లు పలువురు గుర్తు చేశారు. అనంతరం దేవాలయాల్లో విశేష పంచామృతాభిషేకం, అష్టోత్తరనామ పూజలు నిర్వహించారు.