శ్రీకాకుళంలో తగ్గుముఖం పట్టిన డయేరియా

శ్రీకాకుళంలో తగ్గుముఖం పట్టిన డయేరియా

శ్రీకాకుళం నగరంలో ఐదు వార్డు సచివాలయాల పరిధిలో ఈనెల 23 నుంచి డయేరియా ప్రధాన సమస్యగా మారింది. గరిష్టంగా 102 కేసులు నమోదు కావడంతో యంత్రాంగాన్ని ఆందోళన గురి చేసింది. ఈ నేపథ్యంలో గురువారం నాటికి కొంతవరకు తగ్గు ముఖం పట్టింది. ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి, ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు.