కేంద్ర మాజీమంత్రి కన్నుమూత

కేంద్ర మాజీమంత్రి కన్నుమూత

కేంద్ర మాజీమంత్రి శివరాజ్ పాటిల్ (90) అనారోగ్యంతో కన్నుమూశారు. మహారాష్ట్ర లాతూర్‌లోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. శివరాజ్‌ పాటిల్‌ లాతూర్‌ నుంచి ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1991-96 వరకు లోక్‌సభ స్పీకర్‌గా, 2004-2008 వరకు కేంద్ర హోంమంత్రిగా ఆయన పనిచేశారు. 2010-15 మధ్య పంజాబ్ గవర్నర్‌గా విధులు నిర్వర్తించారు.