కొవ్వూరు ఆర్డీవోగా రాజా రమేశ్ బాధ్యతలు
తూ.గో: కొవ్వూరు ఆర్డీవోగా రాజా రమేశ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్రూప్-1 అధికారులను బదిలీ చేయగా, ఆ ఉత్తర్వులతో ఆయన కొవ్వూరుకు నియమితులయ్యారు. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొని నూతన ఆర్డీవోకు స్వాగతం పలికారు.