'గ్యాస్ సిలిండర్ పేరుతో సైబర్ మోసాలు'
KRNL: గ్యాస్ సిలిండర్ల కొరతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు తప్పుడు సందేశాలు పంపి ప్రజలను మోసం చేసే అవకాశాలు ఉన్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. గ్యాస్ బుకింగ్ కోసం అధికారిక యాప్లు, వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలని, తెలియని లింక్లపై క్లిక్ చేయకూడదని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేయాలని చెప్పారు.