విజయవంతంగా ముగిసిన సైన్స్ ఫెయిర్
SRD: ఖేడ్లో మూడు రోజుల పాటు నిర్వహించిన 53వ జిల్లా సైన్స్ ఫెయిర్ విజయవంతమైందని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి గురువారం తెలిపారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 13,742 మంది విద్యార్థులు సైన్స్ ఫెయిర్ను తిలకించారన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. అదేవిధంగా విద్యార్థులు సంస్కృతి కార్యక్రమాలు చేశారు.