మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను ప్రారంభించిన మంత్రి
HYD: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గోషామహల్లో రామ్ మనోహర్ లోహియా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే రాజాసింగ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రూ.3.92 కోట్ల GHMC నిధులతో రెండు దశల్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.