'ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి'

NDL: కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయి పల్లె గ్రామంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జేడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పర్యటించారు. బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ అనే కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్యే అన్నారు.