చిరుత దాడిలో మూడు పొట్టేళ్లు మృతి
SS: పెనుకొండలోని జీఐసీ కాలనీలో శనివారం చిరుత దాడి చేయడంతో రైతు వెంకటేశ్కు చెందిన మూడు పొట్టేళ్లు మృతి చెందాయి. రూ.1,20,000 వేల నష్టం వాటిల్లిందని వెంకటేశ్ తెలిపారు. వెటర్నరీ డాక్టర్ జాహ్నవి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాహుల్, టీడీపీ పట్టణ కన్వీనర్ శ్రీరాములు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం తరపున రైతుకు పరిహారం చెల్లిస్తామని తెలిపారు.