రేవంత్ను కలిసిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు
TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు CM రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ క్రమంలో తమ సమస్యలను CM దృష్టికి తీసుకువచ్చారు. పాస్టర్ల సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో పాస్టర్లు.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కాంగ్రెస్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు.