వేంపల్లె తహసీల్దార్గా మోహన్ కృష్ణ
KDP: వేంపల్లె మండల తహసీల్దార్గా పి. మోహన్ కృష్ణ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. గతంలో నందలూరులో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసిన ఆయన, పదోన్నతిపై వేంపల్లెకు బదిలీ అయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు. మండల అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.