డ్రంక్ అండ్ డ్రైవ్లో నలుగురికి రూ. 40 వేల జరిమానా
NZB: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించారు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన నలుగురు వ్యక్తులను కోర్టులో హాజరు పరచారు. కాగా ఆ వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున మొత్తం రూ. 40 వేల జరిమానాను జేఎఫ్సీఎం మేజిస్ట్రేట్ సరళ రాణి విధించినట్లు ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ ఇవాళ తెలిపారు.