ప్రతి ఉత్సవానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు

ప్రతి ఉత్సవానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు

TPT: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఫిబ్రవరి 15 నుంచి 23 వరకు జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అందించిన సేవలు ప్రశంసనీయమని ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ తెలిపారు. దేవస్థానం పరిపాలన భవనంలోని ఛైర్మన్ కార్యాలయంలో ఆయన స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.