అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు
KDP: పులివెందుల పుల్లంగల్లా సర్కిల్లో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, వైస్ ఛైర్మన్ మనోహర్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.