ప్రయాణికులకు షాక్.. రేణిగుంట రైల్వే బ్రిడ్జి క్లోజ్..!
KDP: రేణిగుంట రైల్వే అండర్ బ్రిడ్జిను మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు RDO భాను ప్రకాశ్ రెడ్డి ప్రకటించారు. 50 ఏళ్ల కాలం నాటి బ్రిడ్జి కావడంతో మరమ్మతులు అవసరమని రైల్వే శాఖ నిర్ణయించిందన్నారు. కరకంబాడి రోడ్, కొత్త బైపాస్ మార్గాల్లో వాహనాలు వెళ్లాలని ఆయన సూచించారు. ఈ మార్గంలో కడప వాహనదారులు వెళ్తుంటారు కాబట్టి గమనించాలన్నారు.