సీఎం చంద్రబాబును కలిసిన వెంకట శివుడు యాదవ్
ATP: విజయవాడ సెక్రటేరియట్లోని ముఖ్యమంత్రి ఛాంబర్లో నారా చంద్రబాబు నాయుడిని లేబర్ బోర్డ్ ఛైర్మన్ వెంకట శివుడు యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గుంతకల్లు నియోజకవర్గంలోని పలు కీలక అభివృద్ధి అంశాలపై ఆయనతో చర్చించారు. నియోజకవర్గ సమస్యలను వివరించగా సీఎం సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.