తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్

తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్

నిజామాబాద్ జిల్లా కంటేశ్వర్‌లో నూతనంగా నిర్మించిన రూరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ప్రారంభించారు. కార్యాలయ సదుపాయాలను పరిశీలించి, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేంద్ర కుమార్, తహసీల్దార్ వినయ్ సాగర్, తదితరులు పాల్గొన్నారు.