తూముల ఏర్పాటును పరిశీలించిన అధికారులు, నేతలు

ELR: జంగారెడ్డిగూడెం స్థానిక శ్రీరామ్ నగర్లో డ్రైనేజీ నీరు సజావుగా వెళ్లడానికి సుమారు రూ. 5 లక్షలు వెచ్చించి 6 తూములని ఏర్పాటు చేశారు. శుక్రవారం మున్సిపల్ అధికారులతో కలిసి పలువురు కౌన్సిలర్లు వాటిని పరిశీలించారు. ఎప్పటి నుంచో ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.