'అడ్వర్టైజ్మెంట్ పరిశ్రమపై కూడా కన్ను పడింది'
HYD: అడ్వర్టైజ్మెంట్ పరిశ్రమపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కన్ను పడిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ భవన్ వద్ద ఆయన మాట్లాడుతూ.. జీవో 84 అనే దొంగ జీవో ద్వారా సీఎం రేవంత్ రెడ్డి బంధువులకు అడ్వర్టైజ్మెంట్లను ఇచ్చేలా కుట్రలు చేస్తున్నారన్నారు. వందల కోట్ల రూపాయల పరిశ్రమను సీఎం కనుసన్నల్లో ఉండే కంపెనీలకు ఇచ్చేలా ఈ దొంగ జీవోను తీసుకొచ్చారని ఆరోపించారు.