హామీ పత్రంపై అభ్యర్థుల సంతకాలు
ADB: బోథ్ మండలం న్యూ కాలనీలోని ఓ కిరాణ షాపు యజమాని అజీమ్ వినూత్న ప్రయత్నం చేశారు. గతంలో ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు తమ 15వ వార్డు సమస్యలను పట్టించుకోలేదని, ఈసారి ఎన్నికల్లో ఓటు అడిగేందుకు వచ్చే అభ్యర్థులతో హామీ పత్రం మీద సంతకాలు చేయించుకుంటున్నారు. కాలనీ సమస్యలను స్పష్టంగా ఒక ప్లకార్డు మీద రాసి గెలిచిన తర్వాత ఈ గల్లీ సమస్యలను తప్పనిసరిగా పరిష్కరించాలని కోరారు.