ఒంగోలు -తిరుపతికి సూపర్ లగ్జరీ బస్సు

ఒంగోలు -తిరుపతికి సూపర్ లగ్జరీ బస్సు

ప్రకాశం: ఒంగోలు నుంచి తిరుపతికి ప్రయాణించే వారి సౌలభ్యం కోసం శనివారం నుంచి సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ప్రారంభిస్తున్నట్లు డీఎం శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ప్రతి రోజు రాత్రి 11 గంటలకు ఒంగోలులో బయలుదేరి ఈ బస్సు తెల్లవారుజామున 5:45 గంటలకు తిరుపతి చేరుకుంటుందన్నారు. అదే రోజు రాత్రి 8:15 గంటలకు తిరుపతి నుంచి వస్తుందని చెప్పారు.