మెగా వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

మెగా వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డికల్లు పంచాయతీ చింతలపాడు గ్రామంలో నిర్వహించిన మెగా వాలీబాల్ టోర్నమెంట్‌ను రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు మల్లేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జట్లను ఆయన అభినందించారు. క్రీడలు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా స్నేహభావాన్ని పెంచుతాయని చెప్పారు.