కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
BPT: కారంచేడు మండలం కుంకలమర్రులోని కొమ్మమూరు కాలువ వద్ద శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవ్వడం కలకలం రేపింది. ఎస్సై ఖాదర్ భాష తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయస్సు గల ఈ వ్యక్తి మృతదేహం నరసయ్యపాలెం లాకుల వద్ద నుండి నీటిలో కొట్టుకువచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.