రేపు PGRS నిర్వహణ
NLR: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే PGRSను సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నందు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్సైట్ Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చని అన్నారు. ఇతర వివరాలకు సంబంధించి సమాచారం కోసం 1100 కాల్ సెంటర్ను సంప్రదించవచ్చని తెలిపారు.