'భూవివాదాలను త్వరగా పరిష్కరించండి'

గుంటూరు: భూవివాదాలపై ప్రజల నుంచి ఎక్కువ విజ్ఞప్తులు వస్తున్నందున, ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. సంబంధిత శాఖతో సమన్వయం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఉండవల్లిలోని నివాసంలో 28వ రోజు మంత్రి లోకేష్ “ప్రజాదర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలను విన్నవించారు.