CM చంద్రబాబుకు MLC బొత్స హెచ్చరిక

AP: రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మరోసారి సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో MLC బొత్స సత్యనారాయణ CM చంద్రబాబును హెచ్చరించారు. విశాఖ ఉక్కు పరిరక్షణే తమ ధ్యేయమని, ప్రైవేటీకరణ చేయనివ్వమన్నారు. ప్రజా ఉద్యమంగా మారితేనే స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్పరం చేయడం చంద్రబాబు నైజమని బొత్స విమర్శించారు.