అనారోగ్యంతో తాపీ మేస్త్రి ఆత్మహత్య

అనారోగ్యంతో తాపీ మేస్త్రి ఆత్మహత్య

MDK: తూప్రాన్ పట్టణానికి చెందిన తాపీ మేస్త్రి తిమ్మాపురం సత్యనారాయణ (55) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై గంగరాజు తెలిపారు. సత్యనారాయణకు గతంలో బైపాస్ సర్జరీ జరగగా, కొద్దిరోజులుగా పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. అనారోగ్యం కారణంగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. కూతురు జానకి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.