వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: ఎంపీ

వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: ఎంపీ

HNK: తెలంగాణను ఉద్దేశించి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపీ కావ్య అన్నారు. పార్లమెంటులో ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజల త్యాగాలను అవమానించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఏళ్ల పోరాట ఫలితమని, ఇలాంటి వ్యాఖ్యలను కొనసాగిస్తే తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదని హెచ్చరించారు.