రెండు కిలోల గంజాయి పట్టివేత

రెండు కిలోల గంజాయి పట్టివేత

SKLM: ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ పరిధిలో ఎస్సై ఆర్. జనార్దనరావు తన సిబ్బందితో ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు అనుమానస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి నుండి రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గంజాయి నిల్వ, రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.